RN DAILY     G9 TELUGU TV    ePaper

దేశానికి మోడీ, బిజెపి అధిష్టానం క్షమాపణ చెప్పాలి

బిజెపి దేశాన్ని ఏలుతున్నందుకు సిగ్గుగా ఉంది
ఇదేనా.. బిజేపి సంస్కృతి..?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాక్యాలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో అస్సాం సీఎం వ్యాక్యాలను తీవ్రంగా ఖండించారు. దేశ సంస్కృతికి విరుద్దంగా బిజెపి ముఖ్యమంత్రి శర్మ చేసిన వ్యాఖ్యాలకు దేశ ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పైన ఇలాంటి వ్యాక్యాలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి శర్మ…. ఇదేనా నీ సంస్కృతి, సంస్కారం అని నిప్పులు చెరిగారు. ఇటువంటి సంస్కృతి కలిగిన బిజెపి ఈదేశాన్ని పాలించడం సిగ్గుగా ఉందని వ్యాక్యానించారు. బీజేపీకి అధిష్టానం మెప్పు కోసం రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం చేసిన వ్యాక్యాలకు భవిష్యత్తులో కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!